సీఎస్ఐ ఆస్తుల రక్షణకు పోరుబాట
AP: సీఎస్ఐ బిషప్ పరిపాలనకు బదులుగా సినాడ్ ఆధ్వర్యంలో పాలన కొనసాగించాలని పాస్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సీఎస్ఐ, లండన్ మిషన్కు చెందిన విలువైన భూములు, స్థిరాస్తులను లీజుల పేరుతో అనధికారికంగా విక్రయిస్తున్నారంటూ అసోసియేషన్ ఆరోపణలు చేసింది. 146 ఏళ్ల చరిత్ర కలిగిన లండన్ మిషన్ స్కూల్ పరిసరాల్లోని ఆస్తులతో పాటు అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని ఆరోగ్యవరం మిషన్ ఆస్తుల పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. కోట్ల రూపాయల విలువైన మిషన్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.



