← Back to news

దత్తత ఆశ చూపి.. రూ. 1.40 లక్షలతో పరార్!

By Sahani· 16h ago· Eenadu
దత్తత ఆశ చూపి.. రూ. 1.40 లక్షలతో పరార్!

బాబును దత్తత ఇప్పిస్తామని నమ్మించి ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డికి చెందిన ప్రమీలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఖమ్మం వ్యక్తి పరిచయమై, రూ.4 లక్షలు ఇస్తే బాబును ఇప్పిస్తానని నమ్మించాడు. ప్రమీల నుంచి రూ.1.40 లక్షలు తీసుకుని, నకిలీ డ్రామాతో శిశువును, క్యాష్‌ను తీసుకుని పారిపోయారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుల నుంచి రూ.1.40 లక్షల క్యాష్, బైక్స్, ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు రిజిస్టర్ చేశారు.

More in Current Affairs