తెలంగాణలో విద్యాసంస్థలు షట్డౌన్

నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థలు మూతపడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ NSUI, SFI, AISF, PDSU తదితర సంఘాలు బంద్ నిర్వహించాయి. బంద్ ప్రభావంతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, JNTU పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.



