వీఆర్ఏలకు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్

AP: రాష్ట్రంలో వీఆర్ఏలుగా పని చేస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలో వీఆర్ఏలు నిరసన దీక్షకు దిగారు. రూ.10,500 జీతంతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2018 నుండి పెరగని జీతాలతోపాటు పెరిగిన పనిభారంతో ఇబ్బందులు పడుతున్నామని వీఆర్ఏలు ఆరోపణలు చేశారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ వీఆర్ఏలకు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ ఒకేసారి సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు.



