← Back to news

ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

By DK· 20 Jul 2026· మహబూబాబాద్ జిల్లా
ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ సమయానికి హాజరు కాకపోవడం, విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో స్టూడెంట్స్ చదువు దెబ్బతింటోందని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Education