కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలి: తుమ్మల

తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కేంద్రం సహకారం కోరుతూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు, రాష్ట్రంలో ఆయిల్పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్పామ్కు కనీస మద్దతు ధర రూ.25వేలు నిర్ణయించాలని, పప్పుధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్నను 100 శాతం సేకరించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.



