ఫ్లెక్సీలతో భూ నిర్వాసితుల నిరసన
TG: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామంలో భూ నిర్వాసితులు నిరసన తెలిపారు.2016 పుష్కరాల తరుణంలో రోడ్డు విస్తరణలో తమ ఇళ్ళను, స్ధలాలను కోల్పోయిన సుమారు 60 కుటుంబాలు దీక్ష చేపట్టారు. మంత్రి నారా లోకేష్ తమ గ్రామానికి వచ్చి బాధితుల పరిస్థితిని గమనించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి తమ గ్రామానికి రావాలంటూ చంద్రాల గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రాణాలు పోతున్నా పరిహారం చెల్లించడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



