← Back to news

విజయవాడ నుంచి కాశీకి నేరుగా ఫ్లైట్

By Venkat V· 16 Aug 2026
విజయవాడ నుంచి కాశీకి నేరుగా ఫ్లైట్

AP: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వారణాసికి నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇండిగో సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా సర్వీసును ప్రారంభించారు. వారణాసి–విజయవాడ మధ్య విమానాలు మంగళవారం, గురువారం, శనివారం నడవనున్నాయి. ఇప్పటివరకు ఇతర నగరాల్లో విమానాలు మారాల్సిన ప్రయాణికులకు ఇప్పుడు నేరుగా కాశీ చేరుకునే అవకాశం దక్కింది.

More in AP