← Back to news

‘ఏమైపోతున్నాయి ఆప్యాయతలు?’..కదిలించిన సజ్జనార్ పోస్ట్

By విశీ· 6 Aug 2026

హరియాణా రాష్ట్రం సోనిపట్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వృద్ధాశ్రమంలో మరణించారు. కుమార్తెలు కన్నతండ్రి అంత్యక్రియలను రాలేక వీడియో కాల్ ద్వారా చూస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం రూ.5 వేలు పంపించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌ ఎంతోమందిని కదిలిస్తోంది.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.