వివాదంలో రణబీర్-సాయిపల్లవిల ‘రామాయణ’

రణబీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తున్న ‘రామాయణ’ సినిమా విడుదలకు ముందే కాంట్రవర్సీని ఎదుర్కొంటోంది. సినిమాలో కొన్ని డైలాగులు, సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నట్లు ఢిల్లీలోని శ్రీరామ్లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్రబృందానికి లెటర్ రాశారు. విడుదల కంటే ముందే స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అబ్జెక్షన్ ఉన్న సీన్స్ను తొలగించకపోతే నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.



