ఢిల్లీ గోడౌన్లో ఫైర్.. భయంతో బిల్డింగ్ నుంచి జంప్!
ఢిల్లీలోని స్వరూప్ నగర్లో ఓ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూడో డ్రెస్లు, బాక్సింగ్ గ్లౌవ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలోని గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మంటల భయంతో ఎదురుగా ఉన్న భవనం నుంచి మహిళలు, పిల్లలతో సహా ఆరుగురు కిందకు దూకడంతో గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తీసుకెళ్లగా, ప్రమాదం నుంచి బయటపడ్డారు. 15 ఫైర్ టెండర్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.


