చెస్ టోర్నీలో తెలంగాణ కుర్రాడికి విజయం

TG : ఆల్ ఇండియా ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి పి. రాజ్కుమార్ విన్నర్గా నిలిచాడు. నాగ్పూర్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 9 రౌండ్లలో 8.5 పాయింట్లు సాధించి టాప్లో నిలిచాడు. ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా ఆడిన రాజ్కుమార్ ట్రోఫీతో పాటు రూ.50 వేల క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకున్నాడు.



