ప్రపంచంలో ఉన్న పులుల్లో 70% మన దేశంలోనే

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ ముఖ్యమైన విషయాలు చెప్పింది. పులులను కాపాడటం అంటే కేవలం ఒక జంతువును రక్షించడం కాదని, మన అడవులు, నదులు, మొత్తం పర్యావరణాన్నికాపాడుకోవడమే అని తెలిపింది. ప్రధాని మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రపంచంలో ఉన్న పులుల్లో 70% మన దేశంలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అని అయన 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.



