బస్సు కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్

TG: జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలోకి RTC బస్సు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ గ్రామం బయట ఉన్న స్టేజి వరకు వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కలిసి స్టేజి వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలోకి RTC బస్సును నడిపి విద్యార్థులను అక్కడి నుంచే ఎక్కించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.



