← Back to news

బస్సు కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్

By dk· 6 Aug 2026· జోగులాంబగద్వాల జిల్లా
బస్సు కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్

TG: జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలోకి RTC బస్సు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ గ్రామం బయట ఉన్న స్టేజి వరకు వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కలిసి స్టేజి వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలోకి RTC బస్సును నడిపి విద్యార్థులను అక్కడి నుంచే ఎక్కించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.

More in Education