← Back to news

రామాపురం బీచ్‌లో యువతి గల్లంతు

By dk yamjala· 4 Jun 2026· Getlokalapp· పల్నాడు జిల్లా
రామాపురం బీచ్‌లో యువతి గల్లంతు

AP: సముద్ర తీర విహారం ఓ ఫ్యామిలికి విషాదంగా మారింది. చీరాల మండలం రామాపురం బీచ్‌లో పల్నాడు జిల్లా రావులపాలెం విలేజ్‌కు చెందిన నాగలక్ష్మి(26) తన కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లింది. సముద్రంలో దిగగా ఒక్కసారిగా పెద్దఎత్తున వచ్చిన అలల ధాటికి ఆమె గల్లంతయింది. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు వెంటనే నాగలక్ష్మి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

More in AP