రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

AP : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ 516E నేషనల్ హైవేపై రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. విశాఖ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్తున్న ఒక కార్, ముందు వెళ్తున్న బైక్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఆరేళ్ల నాగసూర్య అనే బాబు తలకి గాయం కావడంతో, అరకు ఏరియా హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వెంటనే విశాఖ KGHకి షిఫ్ట్ చేశారు. స్పాట్కి చేరుకున్న పోలీసులు కార్లో ఉన్నవాళ్లను కస్టడీలోకి తీసుకుని కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



