16వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష!

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. దీనిపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ప్రభుత్వం దీన్ని 'ఈగో' సమస్యగా మార్చవద్దని, ఇక్కడ హ్యూమన్ లైవ్స్ ముఖ్యం అని ట్వీట్ చేశారు. తప్పును ఒప్పుకోవడం బలహీనత కాదు, అకౌంటబిలిటీకి నిదర్శనమని పేర్కొన్నారు. స్టూడెంట్స్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. మరోవైపు, రోజురోజుకూ క్షీణిస్తున్న వాంగ్చుక్ హెల్త్ కండిషన్పై ఇప్పుడు అందరిలో తీవ్ర ఆందోళన మొదలైంది.



