పోలీసుల బస్సుకు యాక్సిడెంట్.. 10 మందికి గాయాలు!

AP: విశాఖపట్నంలోని జూ పార్క్ దగ్గరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ఎస్కార్ట్ పోలీసులతో వెళ్తున్న స్కైలైన్ బస్సు. జూ పార్క్ వద్ద కారును తప్పిస్తుండగా అదుపుతప్పింది. డివైడర్ను దాటి మధురవాడ నుంచి విశాఖ వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఓ కానిస్టేబుల్ కాలు విరిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఘటనపై అధికారులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.



