నేడు 'తెలుగు' భాషా దినోత్సవం.. గిడుగు రామమూర్తి జయంతి

నేడు తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఈ రోజును జరుపుకుంటున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామమూర్తి బలమైన పునాది వేశారు. ప్రజలు మాట్లాడే భాషలోనే విద్య, రచనలు ఉండాలని ఆయన కోరుకున్నారు. సులభమైన తెలుగును ప్రజలకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా తెలుగు భాషను కాపాడుకుందాం. కొత్త తరానికి తెలుగును మరింత దగ్గర చేద్దాం.



