భూములు అమ్మే అధికారం ఎవరిచ్చారు?: హరీశ్రావు

TG: ప్రభుత్వానికి చెందిన విలువైన వారసత్వ భూములను భవిష్యత్ తరాలకు కాపాడాల్సిన బాధ్యత CM రేవంత్రెడ్డిపై ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ మేరకు రేవంత్రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని BRS తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ భూములను జాతి సంపదగా పేర్కొన్న రేవంత్రెడ్డి ఇప్పుడు వాటిని ఎందుకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.


