MNR ఫౌండేషన్ 9వ ఉచిత కంటి వైద్య శిబిరం

AP: మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో MNR ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో 9వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పుల్లూరు :ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ(PACS)లో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. 112 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 57 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.




