స్మార్ట్ గ్లాసెస్తో చిక్కిన భక్తులు!

తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరాలయంలోకి కెమెరా గ్లాసెస్తో ఎంట్రీ ఇచ్చిన తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయగా, శనివారం ఉదయం తెలంగాణకు చెందిన పవనేశ్, మహేశ్ స్మార్ట్ కెమెరా ఉన్న కళ్లజోడు ధరించి క్యూలైన్లో నిల్చున్నారు. వారి మూవ్మెంట్పై డౌట్ వచ్చిన పోలీసులు చెక్ చేయగా, గ్లాసెస్లో ఉన్న సీక్రెట్ కెమెరా బయటపడింది. వెంటనే వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.



