పెద్ద చదువులు చదివినా తల్లిదండ్రులే పోషించాలా?

"తెలంగాణలో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులను ఇంకా తల్లిదండ్రులే పోషించాలా? ఇదేం విద్యా విధానం?!" అని డెమోక్రాటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (DATA) ప్రశ్నించింది. ఏటా లక్షకు పైగా ఇంజనీరింగ్ పట్టభద్రులవుతున్నా, కేవలం 25% మందికే ఉద్యోగాలొస్తున్నాయని మండిపడింది. విద్యా సంక్షోభం, ప్రైవేట్ కాలేజీల అక్రమాలపై జూలై 19న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో DATA రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. ముఫ్ఫఖం జా కాలేజీలో ప్రొఫెసర్ల అక్రమ తొలగింపులను ఖండిస్తూ, ప్రైవేట్ కాలేజీల విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేసింది.





