ఆర్మీ భూములు కాపాడాలంటూ హైడ్రాకు వినతిపత్రం

TG: ఆర్మీకి చెందిన కబ్జా చేసిన భూమిని కాపాడాలని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆర్మీ లెఫ్ట్నెంట్ కల్నల్ జైసింగ్ కలిసి వినతిపత్రం ఇచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, గ్రామంలోని ఆర్మీకి చెందిన భూమిలో ఆక్రమణల గురించి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నిర్మాణానికి అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.




