మహిళ అస్థిపంజరం..మరణించి రెండేళ్లు?

బెంగళూరులోని ఓ ఇంట్లో దక్షాయిని(57) అనే మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కుమారుడు 2005లో మరణించాడు. దీంతో ఆమెకు స్కిజోఫ్రేనియా వచ్చింది. 2017లో భర్త మరణించాక ఆమె ఒంటరిగా ఉంటోంది. రెండేళ్లుగా ఎవరితోనూ ఆమెకు సంబంధాలు లేవు. ఆమె సోదరుడు మహేష్ బసప్ప పోలీసులకు చెప్పడంతో వాళ్లు వచ్చి శవాన్ని గుర్తించారు. ఆమె మరణించి రెండేళ్లయ్యిందా అని అనుమానిస్తున్నారు.


