ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు

AP: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు స్కూళ్లకు అధికారులు ఈరోజు, రేపు సెలవులు ప్రకటించారు. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆ సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు స్కూల్ బస్సులను వాడనున్నారు. దీంతో రెండు రోజుల పాటు ఆ స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.



