ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి

AP: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి దక్కింది. రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్(ఏపీ గ్రీన్)’ ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా ప్రభుత్వం ఆయనను నియమించింది. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది. నాగబాబు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.



