డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో హైదరాబాద్లోని ఛలో విద్యుత్ సౌధ పేరుతో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వేతన సవరణ కమిటీ ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీ, ఆర్టిజన్లకు క్యాడర్, సీనియారిటీ, ప్రమోషన్లు, సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.



