గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
AP: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో ఉద్రిక్తత నెలకొంది. భీమవరప్పాడు నుండి నిత్యం వందల సంఖ్యలో గ్రావెల్ లారీలు గ్రామం మీదుగా వెళ్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. లారీల రాకపోకలతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, ఇళ్లపై దుమ్ము ధూళి పేరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఏకమై వెల్లటూటరు ప్రధాన రహదారిపై గ్రావెల్ లారీలను అడ్డుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను అడ్డుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. *



