← Back to news

షాద్‌నగర్‌కు చేరిన బద్లావ్ జరూరి హై పాదయాత్ర

By Adithya.D· 19 Aug 2026
షాద్‌నగర్‌కు చేరిన బద్లావ్ జరూరి హై పాదయాత్ర

TG: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు వెంటనే తీసుకువచ్చి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బద్లావ్ జరూరి హై పేరిట పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర షాద్‌నగర్‌కు చేరుకుంది. పట్టణ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పట్ల బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సు యాత్ర చేపట్టినట్లు వివరించారు.

More in TG