విద్యా రుణాల పంపిణీ రెట్టింపుకు కేంద్రం భారీ ప్రణాళిక

దేశంలో విద్యా రుణాల (Education Loans) పంపిణీని రాబోయే ఏడాదిలో రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రక్రియను వేగవంతం చేసి, 10 రోజుల్లోనే రుణాలు మంజూరు చేసేలా బ్యాంక్లకు మార్గదర్శకాలు ఇచ్చారు. కళాశాలల్లోనే ప్రత్యేక క్యాంప్లు నిర్వహించి స్పాట్ శాంక్షన్లు ఇవ్వనున్నారు. రూ. 7.5 లక్షల వరకు గ్యారెంటీ కవరేజ్, co-applicant నిబంధనల సడలింపు ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.



