💸 కరెన్సీలో భారీ మార్పు

భారత్లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు RBI కసరత్తు ప్రారంభించింది. తొలుత రూ.10, రూ.20 నోట్లను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకురానుండగా, విజయవంతమైతే ఇతర నోట్లకూ విస్తరించనుంది. ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఒక్కో నోటు తయారీకి రూ.2 నుంచి రూ.6 వరకు ఖర్చవుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.



