అంగన్వాడీ సెంటర్లో Food Poison

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్వాడీ సెంటర్లో Food Poison జరిగింది. పప్పుకూరలో విషపూరిత గన్నేరు ఆకులు కలిశాయి. వాటిని తిన్న చిన్నారులు, గర్భిణులకు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు వాళ్లను మొదట సత్తుపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు గర్భిణుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.



