గిరిజన ఆశ్రమ పాఠశాల అకాడమీ ఇన్స్ట్రక్టర్ల ఆందోళన

TG: గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయులు జీతాలు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఈనెల 17 నుండి సమ్మె చేస్తున్నారు. గత 11 సంవత్సరాల నుండి ఈ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నా జీతం రూ.10,400 మాత్రమే. సమస్య పరిష్కారం కోసం గాంధీభవన్లో నిర్వహించిన మినిస్టర్తో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు.



