స్మశానం పక్కన చదువు వద్దని పేరెంట్స్ ఆగ్రహం

AP: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గిరిజన ఆశ్రమ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను సాలూరు యూత్ ట్రైనింగ్ సెంటర్కి తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే YTC పక్కనే స్మశానవాటిక ఉండటంతో తమ పిల్లలను అక్కడికి పంపబోమంటూ తల్లిదండ్రులు బస్సులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అవసరమైతే TCలు ఇచ్చి ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామని స్పష్టం చేశారు. 20KM దూరంలోని కేంద్రానికి పంపడం వల్ల పిల్లల చదువు, మానసిక స్థితిపై ప్రభావం పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.



