← Back to news

అన్ని ప్రైవేట్ ఏజెన్సీలను తొలగించాలి: నేహా బోరా

By Vishi· 7 Aug 2026· Jharkhand

జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో AISA అధ్యక్షురాలు నేహా బోరా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతి పరీక్ష ప్రభుత్వ సంస్థలే జవాబుదారీతనంతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ జరిగినప్పుడు బాధ్యతను కేవలం ప్రైవేట్ ఏజెన్సీలపైనే మోపకూడదన్నారు. ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా నిలబెట్టాలన్నారు. అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని ప్రైవేట్ ఏజెన్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు.

More in India