KG మామిడి పండ్లు రూ.2.50 లక్షలు

TG: ఆదిలాబాద్ జిల్లా ఎచ్చోడ మండలం ముఖరా (కే) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి నాలుగేళ్ల క్రితం 5 మియాజాకి మొక్కలు నాటారు. కేరళ నుంచి తెప్పించిన ఈ మియాజాకి మామిడి పండ్లను కోసినట్లు గాడ్గే మీనాక్షి తెలిపారు. 2022లో KTR బర్త్డే సందర్భంగా తమ గ్రామంలోని ఖాళీ స్థలంలో 500 మామిడి మొక్కలతో పాటు 5 మియాజాకి మామిడి మొక్కలను కూడా నాటినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ మొక్కలు పెరిగి పండ్లను ఇచ్చాయని.. వాటిని కోయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మియాజాకి మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.2.50 లక్షల వరకు ధర ఉంటుందని తెలిపారు.




