యువతకు రాష్ట్రపతి స్ట్రాంగ్ మెసేజ్

AP: గ్రామీణ ప్రజలు సులభంగా పనిచేసుకుని, ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారి జీవనోపాధుల మెరుగుదలకు యూనివర్సిటీలు వినూత్న ఆలోచనలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజన వర్సిటీలు ఆ ప్రాంత ప్రజల సాధికారతకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు.



