విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు పోస్ట్పోన్

TG: వరంగల్లోని కాళోజీ నారాయణరావు వైద్యారోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు తెలిపారు. జూలై 24 పరీక్షలు మాత్రమే వాయిదా పడగా, మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.



