సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత

AP: సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. ఏడాదిగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు ఎ.టి.అగ్రహారంలోని తన ఇంట్లో మరణించారు. నాటక రచయితగా ఆయన విశేషమైన పేరు సంపాదించారు. 'సంపద, రోజూ చస్తున్న మనిషి, పక్కింట్లో పుట్టండి, గుర్తు తెలియని శవం' నాటకాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. 'ప్రచండ భారతం' సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ఆయన 'భద్రాచలం', 'ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, 'ఇడియట్’, ‘గోపి గోపిక గోదావరి', ‘చందమామ కథలు’,‘వీరతెలంగాణ’, ‘నాంది’, ‘విరూపాక్ష' తదితర చిత్రాల్లో నటించారు.



