← Back to news

ప్రతి గ్రామం.. ప్రతి పట్టణానికి జలభద్రత: ఉత్తమ్

By DK· 1d ago
ప్రతి గ్రామం.. ప్రతి పట్టణానికి జలభద్రత: ఉత్తమ్

తెలంగాణలో నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగానికి సమగ్ర ప్రణాళిక అవసరమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో జలభద్రతను బలోపేతం చేసేందుకు ప్రతిగ్రామం, పట్టణానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన జల్‌ సంచయ్‌–జన్‌ భాగీదారీ సదస్సులో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 17.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మానేరు, కడెం జలాశయాల్లో పూడిక తొలగింపు ద్వారా నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు వివరించారు.

More in TG