అక్కడ అన్నం తినాలంటే కిలోమీటర్ నడవాల్సిందే

TG: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఒకే ప్రాంగణంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. రెండు స్కూళ్లకు చెందిన విద్యార్థులకు అక్కడే మధ్యాహ్న భోజనం వండి పెట్టేవారు. ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో 2018లో బీర్కూర్ మండలం వీరాపూర్లో కొత్త భవనాన్ని నిర్మించి బడిని అక్కడికి మార్చారు. కానీ 8ఏళ్లు దాటినా వంటగది నిర్మించలేదు. దీంతో డైలీ 100మందికి పైగా విద్యార్థులు భోజనం కోసం మధ్యాహ్నం దాదాపు 1 KM దూరంలో ఉన్న పాత స్కూల్కు ప్లేట్స్ పట్టుకుని వెళ్తున్నారు. అక్కడ తినేందుకు ప్లేస్ కూడా లేకపోవడంతో భోజనం తీసుకుని తిరిగి కొత్త బడికి వచ్చి తింటున్నారు.



