← Back to news

బడి కోసం 8 కి.మీ. నడక.. దొనబైలు పిల్లల ఆవేదన!

By Mahesh· 16 Aug 2026· AP

AP: 'సార్‌.. మా గ్రామానికి రోడ్డు వేయండి.. మేము బడికి వెళ్లాలి' అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె దగ్గర్లోని దొనబైలు గ్రామ విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు. సరైన రోడ్డు లేకపోవడంతో స్టూడెంట్స్ ప్రతిరోజూ దాదాపు 8 కి.మీ. నడిచి స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నారు. వృద్ధులు, మహిళలు, రైతులు, కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ టైమ్‌లో హాస్పిటల్‌కు చేరుకోవడం కష్టంగా మారిందని, గ్రామానికి త్వరగా రోడ్డు వేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

More in AP