← Back to news

Blackmail Politics ఎన్నాళ్లు చేస్తారు: MLA నాయిని రాజేందర్

By Mahesh· 21 Aug 2026· TG
Blackmail Politics ఎన్నాళ్లు చేస్తారు: MLA నాయిని రాజేందర్

TG: కొండా సురేఖ పార్టీలో, ప్రభుత్వంలో ఉంటూ ఇలా వ్యవహరించడం సరికాదని వరంగల్ వెస్ట్ MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్లిపోలేదా? అని నిలదీశారు. కొండా సురేఖపై AICC కఠిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తీరును ప్రజలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాదని మంత్రి పదవులు ఇచ్చినా ఇంతకాలం ఊరుకున్నామని అన్నారు.

More in TG