1995 నుంచి పెన్షన్ అదే.. రిటైరీల ఆవేదన

TG: మూడు దశాబ్దాలుగా పెన్షన్ సవరణ లేకపోవడంతో బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెన్షన్ను అప్డేట్ చేయాలని ఆలిండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సి.జైన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అమీర్పేటలో ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ అధికారులు హాజరయ్యారు.



