గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వర్ల రామయ్య

AP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. YSRCPకి చెందిన పాండుల రవీంద్రబాబు, జాకియా ఖానం పదవీ విరమణతో ఖాళీ అయిన రెండు స్థానాలపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీడీపీ నాయకుడు వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. భవిష్యత్తులో ఆయనకు శాసన మండలి ఛైర్మన్ పదవి కూడా దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.



