ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు పిల్లలకు గాయాలు
రాజస్థాన్లోని ఝలావార్ జిల్లా నయా తలాబ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. భారీ కరెంట్ స్తంభాలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వాళ్లను వెంటనే హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.



