← Back to news

విద్యార్థులకు పురుగుల అన్నం

By DK· 12 Jul 2026
విద్యార్థులకు పురుగుల అన్నం

AP: కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు వద్దనున్న విశ్వభారతి మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడం కలకలం రేపింది. చాలారోజుల నుంచి ఎలాంటి శుభ్రత పాటించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హాస్టల్ విద్యార్థులు అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ కంట్రోల్ అధికారులు కాలేజీ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించారు. పురుగులు పట్టిన 200 KGల బియ్యాని సీజ్ చేసినట్లు, రిపోర్టులు వచ్చాక కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ రావు తెలిపారు.

More in Education