← Back to news

23 మంది విద్యార్థినులకు అస్వస్థత

By Balakrishna· 24 Jul 2026
23 మంది విద్యార్థినులకు అస్వస్థత

TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులంలో 23 మంది ఇంటర్, 10వ తరగతి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి బగారా రైస్, ఆలు కూర, సొరకాయ కూర తిన్న తర్వాత 15 మంది కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. వార్డెన్ వారిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 11 మంది కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. ఉదయం మరో 8 మందికి విరోచనాలు, వాంతులు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని, నరేందర్ రాఠోడ్ (DMHO) తెలిపారు.

More in News