ప్రియాంక కుటుంబానికి చంద్రబాబు భరోసా

AP: రాజమహేంద్రవరం ఘటనలో మెడికో ప్రియాంక<a href="https://www.theclearcutnews.com/n/Bs69Rid"> మృతి</a> చెందడం తీవ్రంగా కలిచివేసిందని CM చంద్రబాబు తెలిపారు. ఆమె మృతికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేసి శిక్షపడేలా చూడాలని CM సూచించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.



